Travel Blog by Thomas Cook India

భారతదేశంలో టాప్ 5 వన్యప్రాణుల అభయారణ్యాలు

భారత దేశంలో అనేక పూలు, జంతు జాతులు ఉన్నాయి. మొత్తం 515 వన్యప్రాణుల అభయారణ్యాలు, 1180 జాతుల పక్షులు, 350 క్షీరద జాతులు, 30000 కీటక జాతులు మరియు 15000 రకాల మొక్కల వంటివి భారతదేశంలో ఉన్నాయి. ఈ పార్కులు మరియు అభయారణ్యాలను చూసేందుకు ఈ జాబితా చాలా విస్తృతమైనది. అందుకే భారతదేశంలోని టాప్5 వన్యప్రాణుల అభయారణ్యాల జాబితా మీరు అసలు మిస్ చేయలేరు!

భారతదేశంలో తప్పనిసరిగా సందర్శించాల్సిన అభయారణ్యాలు

1. కాజీరంగా నేషనల్ పార్క్:

ఈ ప్రతిష్టాత్మక పార్క్.. ప్రకృతి మరియు జంతు ఔత్సాహికులను సుదీర్ఘ కాలంగా ఉత్తేజపరుస్తోంది. భారతదేశంలో అస్సాంలోని గోలాఘాట్ మరియు నాగోన్ జిల్లాలలో ఉన్న కాజిరంగా నేషనల్ పార్క్, దేశంలోని అత్యుత్తమ వన్యప్రాణి అభయారణ్యాలలో ఒకటి. ఒంటి కొమ్ము ఖడ్గమృగ జీవాల్లో 2/3వ వంతు భాగం ఇక్కడే ఉంది. అనేక అరుదైన జాతులకు భద్రత కల్పిస్తున్న కారణంగా, ఇది యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. బ్రహ్మపుత్ర నది చుట్టూ 858 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం పెద్ద ఏనుగుల సంతానోత్పత్తితోపాటు.. అడవి నీటి గేదెలు మరియు చిత్తడి జింకలు ఉన్నాయి. బర్డ్‌లైఫ్ ఇంటర్నేషనల్ ద్వారా ఒక ముఖ్యమైన పక్షి ప్రాంతంగా ఈ ప్రదేశం గుర్తించబడింది. అయితే, ఈ ఉద్యానవనం మే 1 నుండి అక్టోబర్ 31 వరకు మూసివేయబడుతుంది. కాబట్టి, మీ సందర్శనలకు అనుగుణంగా టూర్ ప్లాన్ చేసుకోండి.
సందర్శించడానికి ఉత్తమ సమయం: నవంబర్-ఏప్రిల్

2. జిమ్ కార్బెట్ పార్క్:

ప్రమాదకరమైన బెంగాల్ పులిని రక్షించడానికి, ప్రాజెక్ట్ టైగర్ కింద ఎంపిక చేయబడిన మొట్టమొదటి ప్రాంతం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్.. దేశంలోనే పురాతనమైనది. 520 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 110 చెట్టు జాతులు, 50 రకాల క్షీరదాలు, 650 పక్షి జాతులు, 25 సరీసృపాలు ఇక్కడ ఉన్నాయి. ఈ పార్కు ప్రధానంగా వన్యప్రాణుల రక్షణ కోసమే అయినా, రిజర్వ్ మేనేజ్మెంట్ ఎకో టూరిజంను ప్రోత్సహించింది. ప్రయాణ వ్యర్థాల కోసం, పార్క్‌లో మూడు సఫారీ జోన్స్ ఉన్నాయి. ఝిర్నా, బిర్జని మరియు దిహకాల అనేవి ఈ జోన్లు. మీ షెడ్యూల్ క్లియర్ చేసుకోండి మరియు ప్రతి సీజన్లో పార్క్‌కు వచ్చేన 70,000+ సందర్శకులలో భాగం కండి.
సందర్శించడానికి ఉత్తమ సమయం: మార్చి-జూన్

3. గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ మరియు వన్యప్రాణుల అభయారణ్యం:

ఆసియా సింహాలను, పగ్‌మార్క్‌లను చూసే ఫస్ట్ హ్యాండ్ థ్రిల్ అనుభవించండి. 1965 లో స్థాపించబడిన గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్.. 1412 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ ఉద్యానవనం ఆసియా సింహాలకు ప్రత్యేకమైన ప్రాంతం మరియు అత్యంత ముఖ్యమైన, రక్షిత ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ససాన్-గిర్ అని కూడా ఈ పార్క్‌ను పిలుస్తారు. ఇది భారతదేశంలోని గుజరాత్ లోని తలాలా గిర్ వద్ద ఉంది. గంభీరమైన సింహాలను కాకుండా, చిరుతపులులు, స్లాత్ ఎలుగుబంట్లు, బంగారు నక్కలు, సాంబార్, చింకార మరియు ఇండియన్ కోబ్రాస్‌లకు కూడా ఇది కేంద్రంగా ఉంది. 38 రకాల క్షీరదాలు, 300 జాతుల పూల జాతులు, 37 జాతుల సరీసృపాలు మరియు 2000 కి పైగా కీటకాలు ఉన్నాయి. ఇక్కడ మీ సందర్శన ముందు మేము మీకు ఇచ్చే ఉత్తమ సలహాలను పుష్కలంగా తీసుకోండి.
సందర్శించడానికి ఉత్తమ సమయం: నవంబర్-మే

4. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్:

గ్రేట్ హిమాలయన్ జాతీయ పార్కుకు వెళ్లడానికి తగిన కారణం 1500-6000 మీటర్ల ఎత్తులో ఉన్న జాతీయ పార్కు కావడమే. ఈ పార్క్ 1984 లో హిమాచల్ ప్రదేశ్‌లోని కులు ప్రాంతంలో ఇది నెలకొంది. ఇది 1171 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 375 కంటే ఎక్కువ జంతు జాతులు మరియు వివిధ వృక్ష జాతులు ఉన్నాయి. జూన్ 2014లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో ఈ పార్కు జోడించబడింది. ఈ పార్కులో అత్యుత్తమ భాగం అంతరించిపోతున్న మంచు చిరుత జాతులకు కేటాయించారు. మరియు దాని ప్రాచీన అందంలో హిమాలయాలను కనుగొనండి!
సందర్శించడానికి ఉత్తమ సమయం: ఏప్రిల్-జూన్ మరియు అక్టోబర్-నవంబర్

5. సుందర్బన్ నేషనల్ పార్క్:

బంగ్లాదేశ్ మరియు భారతదేశం.. రెండు దేశాలలో విస్తరించడం ఈ జాతీయ ఉద్యానవనం ప్రత్యేకత. సుందర్బన్ నేషనల్ పార్క్‌కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. దట్టమైన మడ అడవులలో మీరు అడవి పిల్లులు, మొసళ్ళు, పాములు, నక్కలు, అడవి పందులు, పాంగోలిన్స్ వంటి వాటిని చూసేందుకు అవకాశం ఉంటుంది. రాయల్ బెంగాల్ టైగర్ కోసం అతిపెద్ద రిజర్వులలో ఇది ఒకటి. జంతుజాలాల వైవిధ్యం ద్వారా అందరినీ ఆశ్చర్యచకితులను చేసే ప్రాంతం ఇది.
సందర్శించడానికి ఉత్తమ సమయం: సెప్టెంబర్-మార్చి

ఇప్పుడు భారతదేశంలో ఉత్తమ వన్యప్రాణి అభయారణ్యాల జాబితా మీ దగ్గర ఉంది. ఈ ఉద్యానవనాలకు సందర్శించడం అంటే మీలోని టార్జాన్ ఫాంటసీలను సంతృప్తి పరచడమే.